గోదావరిఖని,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలనను పురస్కరించుకొని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ స్థానిక గోదావరిఖని బస్టాండ్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా బస్టాండ్లోని బస్సులో ప్రయాణికులతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆప్యాయంగా సంభాషించి, వారి సమస్యలు, ప్రయాణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రయాణికులకు స్వయంగా మిఠాయిలు తినిపించి ప్రజా పాలన 1000 రోజుల వేడుకల్లో వారిని భాగస్వాములను చేశారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులు ప్రశంసించారు. ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఆర్థికంగా భరోసా కల్పిస్తోందని వారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పేర్కొన్నారు.
======================